సెన్సెక్స్‌ సెంచరీ

28 Sep, 2017 11:06 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  అనూహ్యంగా కోలుకున్నాయి. ఆరంభంలో డీలాపడినప్పటికీ ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ కారణగా సెన్సెక్స్‌ 100పాయింట్లకు పైగా పుంజుకుంది. నిఫ్టీ 9750 కీలక మద్దతు స్తాయికి ఎగువకి చేరింది.  సెన్సెక్స్‌ 106  పాయింట్లు పుంజుకుని 31,266వద్ద,  నిఫ్టీ20 పాయింట్లు బలపడి 9,756 వద్ద ట్రేడవుతోంది.
మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.

అటు డాలర్‌మారకంలో  రూపాయి బలహీనత కొనసాగుతోంది. 0.6పైసల నష్టంతో రూ.65.77వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి పదిగ్రా.  స్వల్పంగా లాభపడి 29,668 వద్ద  ఉంది.

మరిన్ని వార్తలు