సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సందేశాలతో 300పాయింట్లకుపైగా మార్కెట్లు అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. ట్రేడర్ల కొనుగోళ్లతో నిఫ్టీ తిరిగి 11వేల ఎగువకి చేరడం విశేషం. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు 400 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఆటో ఇండెస్స్ కూడా 3శాతం ఎగియడంతో స్టాక్మార్కెట్లు తిరిగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు పుంజుకని 37200 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు ఎగిసి 11025 వద్ద కొనసాగుతోంది. క్యూ 1 ఫలితాల జోష్తో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.