సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. వరుసగా ఆరుసెషన్ల లాభాలనుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రాఫిట్బుకింగ్ కారణంగా సెన్సెక్స్13 పాయింట్ల నష్టంతో 32228 దగ్గర 8 పాయింట్లు కోల్పోయి నిఫ్టీ 10078 దగ్గర కొనసాగుతోంది. ఆసియా మార్కెట్ల నెగిటివ్ సెంటిమెంట్ మన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. టాటా కెమికల్ టాప్ విన్నర్గా ఉంది. భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, దివీస్ లాబ్స్, అదానీ, కోల్ ఇండియా లిబర్టీ షూస్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, బీహెచ్ఈఎల్, సన్టీవీ, ఆసియన్ పెయింట్స్, కోల్గేట్, పెట్రోనెట్ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.