లాభాల జోరు : 11వేల ఎగువకు నిఫ్టీ

6 Feb, 2019 09:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 98 పాయింట్లు ఎగిసి 36714వద్ద, నిప్టీ 35 పాయింట్లు లాభపడి 10969 వద్ద  ట్రేడింగ్‌ను  ఆరంభించాయి.  అనంతరం   మరింత ఎగిసి  68  పాయింట్ల లాభంతో నిఫ్టీ 11వేల స్థాయిని తాకింది.  సెన్సెక్స్‌  డబుల్‌ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది.  అలాగే ఫలితాల జోష్‌తో టెక్‌ మహీంద్ర, హెచ్‌పీసీఎల్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇంకా  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బ్యాంకు, యూపిఎల్‌  కూడా లాభపడుతున్నాయి. భారత్‌ ఫోర్జ్‌, ఆర్‌కాం,  స్ట్రైడ్స్‌ ఫార్మా నష‍్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు