టాప్‌ గేర్‌లో  మారుతి సియాజ్‌ 

11 Oct, 2018 00:56 IST|Sakshi

తొలి అర్ధభాగంలో 24,000 యూనిట్ల విక్రయం 

28.8 శాతం మార్కెట్‌ వాటా 

న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్‌ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌. కల్సీ వెల్లడించారు.

2014లో విడుదలైన సెడాన్‌.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్‌ బుకింగ్స్‌ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు