న్యూఢిల్లీ : సరికొత్త హంగులతో మారుతీ సుజుకీ కొత్త సియాజ్ 2018 ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ అప్డేటెడ్ వెర్షన్ బుకింగ్స్ను కంపెనీ రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఎంఎస్ఐ నెక్సా నెట్వర్క్ నుంచే ఈ మోడల్ను విక్రయించబోతుంది. తొలుత 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్ను బుక్ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెక్సా వెబ్సైట్ నుంచి కూడా దీన్ని ఈ-బుక్ చేసుకోవచ్చు. ఈ వాహనం అనధికారిక బుకింగ్స్ను డీలర్లు రెండు వారాల కిందటే ప్రారంభించారు.
మారుతీ సియాజ్ భారత్లోకి లాంచ్ చేసి నాలుగేళ్లకు పైగా అవుతుంది. గత ఆరు నెలల నుంచి సియాజ్ విక్రయాలు పడిపోతూ ఉన్నాయి. ఈ అమ్మకాలను పెంచడానికి సరికొత్త హంగులతో కొత్త సియాజ్ను మారుతీ సుజుకీ ప్రవేశపెడుతోంది. ఈసారి సియాజ్ ఫ్రంట్ ఎండ్ లుక్స్, ఇంటీరియర్స్తో పాటు ఇంజిన్లోనూ మార్పులు చేశారు. హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, టయోటా యారిస్లకు ఇది పోటీగా నిలువొచ్చన్నది అంచనా.
ఇవీ హంగులు...