మారుతి ఎస్‌-ప్రెస్సోఈ నెల 30న లాంచ్‌

19 Sep, 2019 19:55 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ తన లేటెస్ట్‌  హాచ్‌ బ్యాక్ ఎస్-ప్రెస్సో   వాహనాన్ని ఈ నెల (సెప్టెంబర్) 30న లాంచ్  చేస్తోంది. ఈ మేరకు మారుతి కంపెనీ  మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎంట్రీ లెవల్‌ కారు గా దీన్ని ప్రదర్శించింది.  నాలుగు వేరియంట్‌లలో ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.  మారుతి సుజుకి  స్పోర్టీ లుక్‌లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్‌పి, టార్క్ 90 ఎన్‌ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. దీంతోపాటు సీఎన్‌జీ మోడల్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా. 
 

మరిన్ని వార్తలు