సరికొత్తగా మారుతి ఈకో

2 Apr, 2019 17:12 IST|Sakshi

దేశీయ కారు మేకర్‌ మారుతి తనపాపులర్‌ మోడల్‌ ఈకో క్యాబ్‌ ఆరును కొత్తగా తీర్చి దిద్దింది.  రానున్న భద్రతా నిబంధనలకనుగుణంగా బేసిక్‌ భద్రతా ఫీచర‍్లతో  సరికొత్తగా లాంచ్‌ చేసింది.  ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌  వాహనం ధరను రూ. 3.55 లక్షలుగా (ఎక్స్‌ షో రూం ఢిల్లీ) గతంకంటే రూ.23వేల దర పెంచింది.

1.2 పెట్రోల్‌ ఇంజీన్‌,  సీఎన్‌జీ వేరియంట్లలో  ఈ కారు లభ్యం కానుంది. 73 పవర్‌, 101 గరిష్ట టార్క్‌ ఫీచర్లకు తోడు   డ్రైవర్‌  సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌,   ఫ్రంట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు, స్పీడ్‌ అలర్ట్‌ తదితర ఫీచర్లను అదనంగా జోడించింది. 

మరిన్ని వార్తలు