-

కౌలాలంపూర్లో ‘ఎంఎస్ఎంఈ’ ట్రేడ్ ఫెయిర్

29 Apr, 2016 00:42 IST|Sakshi

హైదరాబాద్: చిన్న సంస్థలకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో కౌలాలంపూర్ (మలేషియా), జొహానెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)ల్లో జరిగే 2 అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్‌లో జరగనున్నట్లు చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ డెవలప్‌మెంట్ విభా గం తెలిపింది. వీటిలో పాల్గొనదల్చుకునే సంస్థలు కౌలాలంపూర్ ఫెయిర్ కోసం ఏప్రిల్ 29లోగా, జొహానెస్‌బర్గ్ ఫెయిర్ కోసం మే 11లోగా దర ఖాస్తు చేసుకోవాలని ఎంఎస్‌ఎంఈ-డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ డి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. సదరు ఎంఎస్‌ఈలకు విమాన చార్జీలు, స్టాల్ వ్యయాలను గరిష్టంగా రూ. 1.25 లక్షల దాకా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఒక ప్రకటనలో వివరించారు.

మరిన్ని వార్తలు