నిలిచిపోయిన ఆర్‌ఐఎల్, అరామ్‌కో డీల్‌..!

24 Jul, 2019 10:38 IST|Sakshi

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీకి చెందిన అరామ్‌కో ఆసక్తి చూపుతుందన్న విషయం తెలిసిందే. కాగా, ఈ డీల్‌ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో లెక్కించిన విలువకు.. ఆర్‌ఐఎల్‌ వాల్యుయేషన్‌కు అంతరం అధికంగా ఉన్న కారణంగానే ఈ డీల్‌ నిలిచిపోయినట్లు చెబుతున్నాయి. అయితే ఊహాగానాలపై మాట్లాడలేమని ఆర్‌ఐఎల్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు