రూ.25.49 లక్షల కోట్లకు ఫండ్‌ ఆస్తులు

5 Jul, 2019 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలానికి రూ.25.49 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో ఉన్న ఫండ్‌ ఆస్తులు, రూ.24.48 లక్షల  కోట్లతో పోల్చితే ఇది 4 శాతం అధికం. ఈ వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. ఏడాది క్రితం ఈ ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరగడం వల్ల ఫండ్‌ ఆస్తులు పెరిగాయని యాంఫీ పేర్కొంది.

మరిన్ని వార్తలు