మింత్రా చేతికి మరో స్టార్టప్‌ కంపెనీ

16 Apr, 2018 14:46 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన మరోస్టార్టప్‌ కంపెనీని సొంతం  చేసుకుంది.   ఈ మేరకు మింత్రా సోమవారం ఒక ప్రకటనను జారీ చేసింది.  తద్వారా బలమైన సాంకేతిక బందాన్ని తయారుచేసుకోవడంతోపాటు, తన ఉత్పత్తి అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకోనున్నట్టు వెల్లడించింది.  భార‌త ఈ-కామ‌ర్స్ వ్యాపారంలో తమ స్థానాన్ని పటిష్టానికి ఈ  సముపార్జన సహాయం చేస్తుందని  మింత్రా  చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జయేంద్రన్ వేణుగోపాల్ చెప్పారు.  300కోట్ల టర్నోవర్‌ తోవేగంగా విస్తరిస్తున్న ఈ  పరిశ్రమలో  ఆన్‌లైన్‌వ్యాపారం 60శాతంగా  ఉందని తెలిపారు.  స్మార్ట్‌షూస్‌,  స్మార్ట్‌  వాచ్స్‌ లాంటి ఉత్పత్తులను కసమర్లకు అందించడానికి దోహదపడుతుందన్నారు.  2014 లో  స్థాపించారు. విట్‌వర్క్స్‌ అనే  కన్స్యూమర్ టెక్నాలజీస్‌   2016లో వేరియబుల్‌ ఫ్లాగ్‌షిప్‌ డివైస్‌ను బ్లింక్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది.

మరిన్ని వార్తలు