న్యూఢిల్లీ: ఆర్బీఐ డిప్యూ టీ గవర్నర్గా ఎన్.ఎస్. విశ్వనాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్గా వ్యవహరిస్తున్న హెచ్.ఆర్.ఖాన్ స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారు. ఖాన్ వచ్చే వారంలో (జూలై 7) పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం విశ్వనాథన్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా నియామకానికి సంబంధించి తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని విశ్వనాథన్ తెలిపారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ల నియామకం సాధారణంగా ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల కమిటీ ద్వారా జరుగుతాయి. కానీ విశ్వనాథన్ నియామకం మాత్రం తొలిసారిగా క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ ఎంపిక ద్వారా జరిగింది.