30 నుంచి నాల్కో బైబ్యాక్ ఆఫర్...

26 Aug, 2016 01:19 IST|Sakshi
30 నుంచి నాల్కో బైబ్యాక్ ఆఫర్...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో షేర్ల బైబ్యాక్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. సెస్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇందులో భాగంగా రూ.2,835 కోట్ల విలువైన సుమారు 64.43 కోట్ల షేర్లను (22.15 శాతం వాటాకు సమానం) కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.44 చొప్పున చెల్లించనుండగా... ఇందుకుగాను రిజర్వ్ నిధులను వినియోగించనుంది. ఎస్‌బీఐ కేపిటల్ మార్కెట్స్‌కు బైబ్యాక్ కార్యక్రమ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఆఫర్ లెటర్‌ను నాల్కో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు అందజేసింది. మూలధనం తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెరుగనున్నట్టు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు