విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!

26 Nov, 2019 05:21 IST|Sakshi

యాక్సిస్‌ బ్యాంక్, స్టాన్‌చార్ట్‌ సీఈవోలకు ఎన్‌సీఎల్‌టీ హెచ్చరిక

ముంబై: ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్‌ బ్యాంక్, స్టాన్‌చార్ట్‌ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్‌ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో అమితాబ్‌ చౌదరి, స్టాన్‌చార్ట్‌ ఇండియా సీఈవో జరీన్‌ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు