నీట్‌కు ఆధార్‌ తప్పనిసరి -సీబీఎస్‌ఈ

9 Feb, 2018 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌- 2018 పరీక్షకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం తప్పని సరి చేస్తూ సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది.  నీట్‌- 2018 పరీక్షలకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అధికారిక వెబ్‌సైట్‌లో  సీబీఎస్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.  

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంటన్స్ టెస్ట్ (నీట్) దరఖాస్తుకు ఆధార్ నంబర్ తప్పనిసరి సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)  ఆదేశించింది. ఈ మేరకు  పరీక్ష తేదీ తదితర వివరాలను cbseneet.nic.in లో గురువారం  వెల్లడించింది. అసోం,జమ్ము కశ్మీర్‌, మేఘాలయ మినహాయించి  మిగతా రాష్ట్రాల అభ్యర్థులు  ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని  పేర్కొంది. అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సులు ప్రవేశానికి మే 6 వ తేదీన  నిర్వహించనున్న ఈ పరీక్షకు  ఆన్‌లైన్‌లో మాత్రమే  దరఖాస్తు చేసుకోవాలి.  ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజునుంచి(ఫిబ్రవరి 9) ప్రారంభమై మార్చి 9 వతేదీ 11.50 వరకు  గడువు వుంటుందని సీబీఎస్‌ఈ తెలిపింది.  మరిన్ని వివరాలు బోర్డు తేదీ అధికారిక వెబ్ సైట్  cbseneet.nic.inలో లభ్యం.
 

మరిన్ని వార్తలు