రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

25 Jul, 2019 11:23 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం వీడియో స్ట్రీమింగ్‌ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌.. భారత మొబైల్‌ వినియోగదారుల కోసం అత్యంత చౌక ప్లాన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.199కే నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ప్లాన్‌లో భాగంగా ఎటువంటి ప్రకటనలు లేనటువంటి స్టాండర్డ్‌ డిఫినిషన్‌ (ఎస్‌డీ) వీడియోలను ప్రేక్షకులు వీక్షించవచ్చని వివరించింది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లకు మాత్రమే వర్తించే ఈ చౌక ప్లాన్‌ కేవలం భారత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉందని సంస్థ ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌ అజయ్‌ అరోరా తెలియజేశారు. ఇతర ఏదేశంలోనూ లేని విధంగా ఇక్కడ మొబైల్‌ ఫోన్‌ సైన్‌ అప్స్‌ తమకు ఉన్నట్లు వెల్లడించారు.  హాత్‌వే, భారతి ఎయిర్‌ టెల్, యాక్ట్‌ ఫైబర్‌నెట్‌తో ఇండియాలో భాగస్వామ్యం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 14.8 కోట్ల చందాదారులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.  

>
మరిన్ని వార్తలు