బీఎండబ్ల్యూ ఎక్స్‌4 లాంచ్‌

21 Jan, 2019 20:49 IST|Sakshi

రెండు డీజిల్‌ వేరియంట్లు

ఒక పెట్రోల్‌ వేరియంట్ ఆవిష్కరణ

 ఎం స్పోర్ట్స్‌ డిజైన్‌ ప్యాకేజ్‌ తొలిసారి భారత మార్కెట్లో

జర్మనీ కార్‌ మేకర్‌ బీఎండబ్ల్యూ కొత్త కారును లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, హంగులతో చెన్నై ప్లాంట్‌లో రూపొందించిన సరికొత్త స్పోర్ట్స్‌ యాక్టివిటీ కూపే మోడల్‌ను విడుదల చేసింది.  ఒక పెట్రోల్‌,  రెండు డీజిల్‌ వేరియంట్లలో తీసుకొచ్చింది. డీజిల్‌ వేరియంట్‌ బీఎండబ్ల్యూ ఎక్స్‌4​ ధరలు వరుసగా  రూ. 60.6లక్షలు, రూ. 65.9లక్షలుగా  నిర్ణయించింది.  

పెట్రోలు  వేరియంట్‌ ధరను రూ.63.5లక్షలుగా ఉంది.  సరికొత్తగా భారత మార్కెట్లో లాంచ్‌ చేసిన ఇవి దేశవ్యాప్తంగా నేటి నుంచే విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. 

దేశీయంగా స్పోర్ట్స్‌ యాక్టివిటీ  వెహికల్‌  సెగ్మెంట్‌ను విస్తరించామనీ,  ఈ విభాగంలో తమ తాజా ఎక్స్‌ 4 ద్వారా ఎం స్పోర్ట్స్‌ డిజైన్‌ ప్యాకేజ్‌ను తొలిసారిగా పరిచయం చేస్తున్నామని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ హాన్స్‌ క్రిస్టియన్‌  బార్ట్‌లెస్‌ ప్రకటించారు.


 

మరిన్ని వార్తలు