హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200 ఆర్‌ బైక్‌ ఆవిష్కరణ

30 Jan, 2018 19:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు, దేశీయదిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త ప్రీమియం మోటార్‌ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది.   200 సీసీ విభాగంలో ఈ కొత్త బైకును లాంచ్‌ చేసింది . ఇప్పటికే 150 సీసీ విభాగంలో విజయవంతమైన ఎక్స్‌ట్రీమ్‌ మోడల్‌ను 200సీసీ విభాగంలో కూడా ప్రవేశపెట్టనుంది. యంగ్‌  కస్టమర్లే లక్ష్యంగా రూపొందంచిన ఈ బైక్‌ 2018, ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ‍్యంగా నాన్‌ ఏబీస్‌ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఏబీస్‌ ఆప్లన్లలో ఇది లభించనుంది. ధర వివరాలను కూడా అప్పుడే రివీల్‌ చేయనుంది.

కొత్త ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌లో సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ 8500 ఆర్‌పీఎం వద్ద 18.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. డిజిటల్ అనలాగ్ కన్సోల్, 5స్పీడ్ గేర్బాక్స్ సిస్టం,   ఫ్రంట్‌లో 37ఎంఎం టేలీస్కోపిక్ ఫోర్కులు వెనుక  7 ఇంచెస్‌ మెనోషాక్‌ సస్పెన్షన్, 17 అంగుళాల స్పోర్టి అల్లాయ్ వీల్స్,ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్  వెనక 130/70 రేడియల్‌ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.   ఈ బైక్‌లో ఉన్న బ్యాలెన్సర్‌ షిఫ్ట్‌ కారణంగా వైబ్రేషన్స్‌ చాలా తక్కువగా ఉంటాయనీ, ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. కాగా ఇది  టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్‌ 200కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

మరిన్ని వార్తలు