ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ లో మరో సరికొత్త రికార్డు స్థాయిలను తాకాయి. నిఫ్టీ తొలిసారి 9700 మార్కును తాకింది. ప్రస్తుతం 11.35 పాయింట్ల లాభంలో 9686 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ సైతం 31,350ను అధిగమించి 50.50 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. టెక్ దిగ్గజం టీసీఎస్ 2 శాతం మేర, ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం ఎస్బీఐ 1 శాతం మేర లాభపడుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఎస్ బీఐ, టీసీఎస్ తో పాటు టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అరబిందో ఫార్మాలు కూడా లాభాలు పండిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 64.35గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 107 రూపాయల లాభంలో 29,195 వద్ద ట్రేడవుతున్నాయి.