పన్ను వసూళ్లలో దూకుడొద్దు

28 Aug, 2019 08:59 IST|Sakshi

పన్ను అధికారులకు ఆర్థిక మంత్రి సూచన

పుణె: పన్ను వసూళ్ల విషయంలో నిగ్రహం పాటించాలని, దూకుడుగా వ్యవహరించరాదని పన్ను అధికారులను కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పుణెలో మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, కస్టమ్స్, ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యాపారాలు ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తాయి. కనుక పన్ను వసూలు చేయడమనే తమ ఉద్యోగ విధుల నిర్వహణ సందర్భంగా వ్యాపారులకు సహకరించడం ఎంతో అవసరం. దూకుడుగా వ్యవహరించొద్దని పన్ను అధికారులకు నా అభ్యర్థన’’ అని మంత్రి అన్నారు.

మరిన్ని వార్తలు