రూ. 300 కోట్ల డైమండ్‌ నెక్లెస్‌ గిఫ్ట్‌

27 Mar, 2019 08:54 IST|Sakshi

ఆకాశమంత పందిరిలా  సాగే  కార్పొరేట్‌ వెడ్డింగ్‌లో ప్రతీ అంశమూ  ప్రత్యేకంగానే నిలుస్తుంది.  వెడ్డింగ్‌ కార్డులు దగ్గరినుంచి, సంగీత్‌, బారాత్‌లంటూ పెళ్లి దాకా సాగా హడావిడి ఇంతా అంతా కాదు.  ఈనేపథ్యంలోనే  రిలయన్స్‌ కుటుంబం కొత్త కోడలికి ఇచ్చిన భారీ కానుక ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. అక్షరాలా  300 కోట్ల రూపాయల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ  తన కొత్త కోడలు శ్లోకా మెహతాకు కానుకగా  ఇచ్చారు.  

నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ  సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట.  అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని  శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట..

వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్‌ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు మార్చి తొమ్మిదిన ముంబైలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.  

#akashambani #akashloka #shlokamehta #ishaambani #anantambani #anandpiramal #radhikamerchant #nitaambani #neetaambani #mukeshambani #kokilabenambani #akustoletheshlo #ambani #ambaniwedding #ambaniengagement #weddingcelebrations #weddingbells #wedmegood #weddingoftheyear #indianwedding #bridesofindia #sabyasachibride #weddingdecor #engagementdecor #floraldecor #engagement #weddingsutra

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

మరిన్ని వార్తలు