ఎన్‌ఎండీసీ లాభం 159 శాతం జంప్‌

29 May, 2018 00:34 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికం(2017–18, క్యూ4)ౖ స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 159 శాతం అధికమై రూ.1,203 కోట్లుగా నమోదయింది.

టర్నోవరు రూ.3,006 కోట్ల నుంచి రూ.4,053 కోట్లకు చేరింది. 2017–18లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.2,522 కోట్ల నుంచి రూ.3,853 కోట్లను తాకింది. టర్నోవరు రూ.9,738 కోట్ల నుంచి రూ.12,134 కోట్లకు ఎగసింది.

మరిన్ని వార్తలు