ఏటీఎంల వద్ద నో క్యూ: ఇంటి వద్దకే డబ్బులు

11 Nov, 2017 08:28 IST|Sakshi

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం లేకుండా వారి ఇంటి వద్దనే బ్యాంకులను ప్రాథమిక సర్వీసులు అందజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. 2017 డిసెంబర్‌ 31 నుంచి ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్‌ బుక్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్‌ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్‌ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. 

ఈ ప్రొగ్రామ్‌ అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటుచేయాలని, సమస్యలను ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని పేర్కొంది. అయితే ఈ సేవలందించినందుకు గాను ఎంత మొత్తంలో ఛార్జీలు విధించనుందో మాత్రం ఆర్‌బీఐ ఇంకా స్పష్టంచేయలేదు. ఇప్పటి నుంచి పెన్షనర్లు తమ ఫిజికల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్‌ పేయింగ్‌ బ్యాంకు బ్రాంచుల వద్ద సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లు సమర్పించిన ఈ సర్టిఫికేట్లను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. చెక్‌ బుక్‌లను అందుకోవడానికి కూడా సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఇక బ్యాంకులకు రావాల్సినవసరం లేదు.

మరిన్ని వార్తలు