నోకియా 2.3 వచ్చేసింది

19 Dec, 2019 01:32 IST|Sakshi

ధర రూ. 8,199

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ హ్యండ్‌సెట్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్‌ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ 6.2 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ. 8,199గా కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్‌కు ఏడాది రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ ఉంది.

మరిన్ని వార్తలు