సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధర రూ.53 తగ్గింపు

2 Mar, 2020 08:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వంట గ్యాస్‌ ధర పెరిగిందని బెంబేలెత్తుతున్న ప్రజలకు ఊరట లభించింది. సబ్సిడీ లేని వంట గ్యాస్‌ ధరను ప్రభుత్వం ఆదివారం తగ్గించింది.  14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీ, ముంబైల్లో రూ. 53 మేర.. అలాగే 19 కేజీల సిలిండర్‌ ధర రూ. 84.50 తగ్గిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఆగష్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు మధ్య ఎల్పీజీ ధర 50 శాతం పెరిగింది.

మరిన్ని వార్తలు