హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు

1 Jun, 2016 01:26 IST|Sakshi
హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ పేమెంట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం వినియోగదారులు హిందుస్తాన్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్‌లో పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అంటే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బండికి పెట్రోల్/డీజిల్ పట్టించుకొని జేబులో నుంచి డబ్బులు (నగదు) ఇవ్వాల్సిన అవసరం లేకుండా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్స్‌ను సులభతరం చేయడమే తమ లక్ష్యమని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు