జూన్9న సిండికేట్ బ్యాంక్ అదాలత్

6 Jun, 2015 02:02 IST|Sakshi
జూన్9న సిండికేట్ బ్యాంక్ అదాలత్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన ఖాతాలను పరిష్కరించుకోవడానికి సిండికేట్ బ్యాంక్ జూన్ తొమ్మిదిన అదాలత్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో ఈ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని, ఒకేసారి చెల్లించడం ద్వారా (వన్‌టైమ్ సెటిలిమెంట్ )ఎన్‌పీఏ ఖాతాలను వదిలించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, వ్యాపార, వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ రుణాలున్న ఎన్‌పీఏ ఖాతాదారులు ఈ అదాలత్‌లో పాల్గొని వన్‌టైమ్ సెటిలిమెంట్ కింద వడ్డీ రాయితీని పొందచ్చని బ్యాంకు తెలిపింది.

మరిన్ని వార్తలు