ఒక్క రూపాయి నోట్లపై ఆర్బీఐ క్లారిటీ

30 May, 2017 18:21 IST|Sakshi
ఒక్క రూపాయి నోట్లపై ఆర్బీఐ క్లారిటీ
పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రవేశపెడుతోంది. తాజాగా కొత్త రూపాయి నోట్లను త్వరలోనే చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నోట్లను ప్రింటింగ్ ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్న ఆర్బీఐ, ఈ నోట్ల వివరాలను మంగళవారం పేర్కొంది. గవర్నమెంట్ ఆఫ్‌ ఇండియా పేరుతో ఈ నోట్లు ఇప్పటికే ప్రింట్ అయ్యాయని ఆర్బీఐ తెలిపింది. కాయినేజ్ యాక్ట్ 2011 కింద వీటిని లీగల్ టెండర్ గా ప్రవేశపెట్టనున్నట్టు సెంట్రల్ బ్యాంకు చెప్పింది.. ఈ కొత్త నోట్లు వల్ల ప్రస్తుతం చలామణిలో ఉన్న రూపాయి నోట్లపై ఎలాంటి ప్రభావముండదని, అవి కూడా లీగల్ టెండర్ గానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.. కొత్త రూపాయి నోట్లకు సంబంధించిన ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
డినామినేషన్ ఆఫ్ నోట్ : ఒక్క రూపాయి కరెన్సీ నోట్
ఆకారం, సైజు : దీర్ఘచతురస్రాకారం  9.7 x 6.3 సెంటీమీటర్స్    
పేపర్ కంపోజిషన్ : ఏ) 100 శాతం (పత్తి) రాంగ్ కంటెంట్
బీ) పేపర్ బరువు : 90జీఎస్ఎం( గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్)
సీ) పేపర్ థింక్ నెస్: 110 మైక్రోన్స్
మల్టిటోనల్ వాటర్ మార్క్స్ : 
1) 'సత్యమేవ జయతే' పదాలు లేకుండా  విండోలో అశోకా పిల్లర్
2) సెంటర్ లో హిడెన్ నెంబర్ '1'
3) కుడి చేతివైపు నిలువుగా అరేంజ్ చేసిన 'భారత్' అనే పదాన్ని దాగి ఉంటుంది. 
 
మరిన్ని వార్తలు