వన్‌ ప్లస్‌ 5టి కొత్త ఎడిషన్

11 Jan, 2018 13:12 IST|Sakshi

చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లోన్‌ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌పోన్‌  వన్ ప్లోస్ 5 టిలో  కొత్త ఎడిషన్‌ను లాంచ్‌  చేసింది. లిమిటెడ్‌ ఎడిషన్‌గా వన్‌ ప్లస్‌ 5టీ  "లావా రెడ్" ఎడిషన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో గురువారం  విడుదల  చేసింది. ఈ డివైస్‌ రిజిస్ట్రేషన్లు నేటినుంచి అమెజాన్ లో ప్రారంభమైనాయని,  జనవరి 20వ తేదీ మధ్యాహ్నంనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది అయితే  6జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌  కాన్ఫిగరేషన్‌ లభిస్తున్న ఒరిజినల్‌  వన్‌ప్లస్‌ 5 టీ లా కుండా 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. దీని ధరను  రూ .37,999 గా నిర్ణయించింది.

అందమైన డిజైన్, పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌లకై  ఎదురుచూస్తున్న తమ వినియోగదారులకు కోసం మొట్టమొదటి​  'లావా రెడ్' ఎడిషన్‌తో 2018నూతన సంవత్సరం ప్రారంభించడం సంతోషంగా ఉందని  వన్‌ ప్లస్‌ ఇండియా జనరల్ మేనేజర్  వికాస్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 6అంగుళాల ఫుల్‌ అమోలెడ్‌ డిస్‌ ప్లే,16ఎంపీ + 20ఎంపీ  డ్యూయల్ రియర్‌కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 835 చిప్‌సెట్‌ ,డాష్ ఛార్జ్ తదితర ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపర్చినట్టు  చెప్పారు.
 

మరిన్ని వార్తలు