ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోన్ ఎ31(2020)ని ఇండోనేషియా మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. బడ్జెట్ రేంజ్లో తీసుకొని వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.13,500గా నిర్ణయించింది. త్వరలోనే ఈ ఫోన్ను భారత్లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఒప్పో ఎ31(2020) ఫీచర్లు
♦ 6.5 ఇంచుల డిస్ప్లే,
♦ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్
♦ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
♦ 12, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్
♦ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
♦ బ్లూటూత్ 5.0
♦ ఆండ్రాయిడ్ 9 పై
♦ 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.