పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా

19 Dec, 2019 04:01 IST|Sakshi

పూర్తయిన లావాదేవీ

న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్‌ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్‌.కె. తిజరీవాలా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు