సానిటరీ ప్యాడ్స్‌పై పతంజలి దృష్టి

26 Dec, 2017 19:46 IST|Sakshi

న్యూఢిల్లీ : రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలోని పతంజలి  ప్రొడక్ట్స్‌ రోజురోజుకు తన ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే వివిధ రకాల మార్కెట్లపై దృష్టి సారించిన పతంజలి గ్రూప్‌ తాజాగా ఆరోగ్యకరమైన న్యాప్‌కిన్‌లు, డైపర్ల తయారీపై ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఈ రంగంలో రూ. 16వేల కోట్ల మార్కెట్‌ సాధిస్తామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే గుప్తా తెలిపారు.

2006లో మొదటిసారి హెర్బల్‌ ఉత్పత్తులతో ప్రస్థానం ప్రారంభించిన పతంజలి గ్రూప్‌.. ఆ తర్వాత న్యూడిల్స్‌, కాస్మోటిక్స్‌, పిల్లలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా పతంజలి స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్‌ జాబితాలో గత సంవత్సరం 45వ స్థానంలో ఉన్న పతంజలి గ్రూప్‌ ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు