డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం అధికారికంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లావాదేవీలను లాంచ్ చేసింది. ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధింపు లేకుండా ప్రారంభమైన దేశంలోనే తొలి బ్యాంకు ఇదే. ఈ అకౌంట్లకు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. దేశంలోనే మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి ఇది లాంచ్ చేసినట్టు తెలిపింది. పాపులర్ పేటీఎం వాలెట్ యాప్లో ఇది అంతర్భాగమని పేటీఎం పేర్కొంది. 2018 నాటికి లక్ష లావాదేవీలకు ఇది సౌకర్యం కల్పిస్తుందని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అంచనావేస్తున్నారు. ఈ కొత్త బ్యాంకులో శర్మ మెజార్టీ వాటాను కలిగి ఉన్నారు. మిగతా షేరు వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కలిగి ఉంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ప్రత్యేకతలు..