పేటీఎం యాప్‌ వాట్సాప్‌కు షాకిస్తుందా?

1 Aug, 2017 20:18 IST|Sakshi
పేటీఎం యాప్‌ వాట్సాప్‌కు షాకిస్తుందా?

ముంబై: పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ను దెబ్బకొట్టేందుకు  ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎ సిద్ధపడుతోంది.   త్వరలోనే వాట్సాప్‌కు పోటీగా ఓ మెసేజింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయనుంది.  
 
సోషల్‌మీడియా  దిగ్గజం ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌ పోటీ గా పేటీఎం  వ్యూహాన్ని రచిస్తోందని  పేటీఎం సన్నిహిత వర్గాల సమాచారం.    సాఫ్ట్‌ బ్యాంక్‌, అలీబాబా  మద్దతునందిస్తున్న ఈ ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ  ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్‌ చేయనుంది.   ఇప్పటికే ఆహారం నుంచి..విమాన టికెట్ల దాకా ప్రతీదాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించేవిధింగా దీన్ని రూపొందించిందట. ముఖ్యంగా  ఈ యాప్‌ ద్వారా  సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు.  అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్‌   స్పందించాల్సి ఉంది.

 కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్‌ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల  వందకోట్లను దాటేసింది. మరి  రానున్న పేటీఎం యాప్‌  స్థిరమైన వృద్ధితో  సాగుతున్న వాట్సాప్‌కు ధీటుగా , పోటీగా నిలబడుతుందా? వేచి చూడాలి.
 
 

మరిన్ని వార్తలు