భారత మార్కెట్ లోకి పెబెల్

13 May, 2016 00:56 IST|Sakshi

నాలుగు మోడళ్ల ఆవిష్కరణ అమెజాన్‌తో జట్టు

 న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబెల్ దేశీ వేరబుల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా నాలుగు స్మార్ట్‌వాచ్ మోడళ్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. క్లాసిక్, టైమ్, టైమ్ స్టీల్, టైమ్ రౌండ్ అనే  వీటి ధరలు రూ.5,999-రూ.15,999 శ్రేణిలో ఉన్నాయి. వీటి విక్రయాల కోసం సంస్థ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేస్తాయని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు