పెట్రో భారాల నుంచి స్వల్ప ఊరట..

26 Oct, 2018 10:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రికార్డు స్ధాయిలో పరుగులు పెట్టిన పెట్రో ఉత్పత్తుల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజులు పైగా వరుసగా తగ్గుతున్న పెట్రో ధరలు శుక్రవారం సైతం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు 27 పైసలు తగ్గి రూ 85.71కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 80.85కు చేరగా, ముంబైల్‌ పెట్రోల్‌ లీటర్‌కు రూ 86.33కు దిగివచ్చింది.

ఇక డీజిల్‌ లీటర్‌కు ఏడు పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో రూ 74.73 పలికింది. ముంబైలో డీజిల్‌ ధర లీటర్‌కు ఎనిమిది పైసలు తగ్గి రూ 78.33కు చేరింది. భగ్గుముంటున్న పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అక్టోబర్‌ 4న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 1.50 మేర తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు