ఎన్‌ఆర్‌ఐల ఆకర్షణకు బ్యాంకుల సాయం కోరాం: పీఎఫ్‌ఆర్‌డీఏ

2 Jul, 2015 00:21 IST|Sakshi

న్యూఢిల్లీ: తన నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)కు ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లను ఆకర్షించడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) బ్యాంకుల సహాయం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంపై ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్ వంటి పలు సంస్థలతో చర్చించినట్లు అథారిటీ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ విలేకరులకు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ నిధుల ఆకర్షణ లక్ష్యంగా... ఎన్‌పీఎస్ విధానాల్లో పలు మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు