పోస్కో ఒడిశా సెజ్ ఆమోదం రద్దు

5 May, 2016 02:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన పొస్కో కంపెనీకి ఒడిశాలో ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్) ఏర్పాటు కోసం ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదాన్ని కేంద్రం రద్దు చేసింది. గత నెల 28న జరిగిన సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ)  ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సెజ్ కోసం పోస్కో కంపెనీ చేసిన ప్రయత్నలు సంతృప్తికరంగా లేవని భావించిన బీఓఏ కమిటీ సెజ్ ఆమోదాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని బీఓఏ మినట్స్ వెల్లడించాయి. ఒడిశాలోనే లాంకో సోలార్ ఏర్పాటు చేయనున్న సెజ్ అనుమతిని కూడా ఇదే కారణాలతో బీఓఏ రద్దు చేసింది.

మరిన్ని వార్తలు