‘పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్’ వేదిక ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) రూ.5 కోట్ల వరకూ రుణాలను ఆఫర్ చేయాలని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్లు ఉన్నాయి. 2018 నవంబర్లో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. రూ.కోటి వరకూ ఆఫర్తో ఈ పథకం ప్రారంభమైంది.