బ్యాంకింగ్‌ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!

14 Feb, 2020 06:16 IST|Sakshi

ఇండోర్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్‌– డిసెంబర్‌ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడైన అంశమిది.

బ్యాంకుల వారీగా చూస్తే...
► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్‌బీఐకి ఎదురయ్యాయి.
► పీఎన్‌బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు.  
► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎదుర్కొంది.  
► ఇక అలహాబాద్‌ బ్యాంక్‌ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు.  
► బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది.  
► యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు.  
► ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు.

మరిన్ని వార్తలు