ఎనిమిది రెట్లు పెరిగిన రామ్‌కీ లాభం

14 Aug, 2018 01:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లాభం క్రితంతో పోలిస్తే ఎనిమిది రెట్లకుపైగా పెరిగింది. లాభం రూ.2.3 కోట్ల నుంచి రూ.18.8 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.337 కోట్ల నుంచి రూ.261 కోట్లకు వచ్చి చేరింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.12 శాతం పెరిగి రూ.171.25 వద్ద స్థిరపడింది.  

>
మరిన్ని వార్తలు