టాటా, నీలేకని, విజయ్ కేల్కర్..మైక్రోఫైనాన్స్ సంస్థ

30 Aug, 2016 01:24 IST|Sakshi

న్యూఢిల్లీ: రతన్ టాటా, నందన్ నిలేకని, విజయ్ కేల్కర్ వంటి దిగ్గజాలు కలిసి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రధానంగా దేశంలోని రుణ లభ్యత లేని వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ‘అవంతి ఫైనాన్స్ త్వరలో రిజిస్ట్రేషన్ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంటుంది. దీని కార్యకలాపాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం అవుతాయి’ అని టాటా ట్రస్ట్ పేర్కొంది.

మరిన్ని వార్తలు