తొమ్మిది బ్యాంకుల మూసివేత... పుకార్లే!

26 Sep, 2019 10:41 IST|Sakshi

కేంద్రం, ఆర్‌బీఐ స్పష్టీకరణ

ముంబై: తొమ్మిది వాణిజ్య బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ...  సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అటు కేంద్రం ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం స్పష్టం చేశాయి. ఈ ప్రచారం వాస్తవ దూరమని ఫైనాన్స్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పైగా మరింత మూలధనం సమకూర్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేయడానికి కేంద్రం తగిన అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఆర్‌బీఐ కూడా సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక ప్రకటన జారీ చేసింది. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌ (పీఎంసీ)పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ‘బ్యాంకుల మూసివేత’ ప్రచారం షికార్లు చేసింది. 

మరిన్ని వార్తలు