ఆర్‌బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వాయిదా

4 Sep, 2018 01:09 IST|Sakshi

కోల్‌కతా: ఆర్‌బీఐ ఉద్యోగులు మూకుమ్మడిగా ఈ నెల 4, 5వ తేదీల్లో తలపెట్టిన సెలవుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్‌బీఐ ఉన్నత యాజమాన్యంతో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం మూకుమ్మడి సెలవు కార్యక్రమాన్ని 2019 జనవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు రిజర్వ్‌ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఐక్య సంఘం తెలిపింది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోని వారు పెన్షన్‌ పథకంలోకి మారే అవకాశం కల్పించాలన్నది ఉద్యోగుల డిమాండ్‌.

మరిన్ని వార్తలు