మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ

14 Oct, 2019 21:03 IST|Sakshi

సాక్షి, ముంబై:  రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది.  నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి రూపాయలు, సిండికేట్ బ్యాంకుకు రూ.  75 లక్షల రూపాయల జరిమానా విధించింది.  ఈ మేరకు నేడు ( సోమవారం, అక్టోబర్ 14) ఉత్తర్వు లు జారీ చేసింది.  ఆస్తి వర్గీకరణ,  మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్‌కు కోటి  రూపాయలు, మోసాల వర్గీకరణ , రిపోర్టింగ్‌పై ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు సిండికేట్ బ్యాంక్‌కు రూ .75 లక్షల ద్రవ్య జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు