త్వరలో రూ.20 కొత్త నోటు

27 Apr, 2019 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఉండే ఈ నోట్లు.. ఆకుపచ్చ, పసుపు కలిసిన రంగులో ఉన్నాయి. ఈ నోటు నమూనాను ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఈ నమూన ప్రకారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంది. అలాగే అశోకుడి స్థూపం కూడా ఉంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉన్నాయి. ఈ నోటు సైజు 63 mm x 129 mm గా ఉండనుంది. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు