రియల్‌మి, 5జీ ‘ఎక్స్‌50 ప్రొ’ వచ్చేస్తోంది

24 Feb, 2020 11:39 IST|Sakshi

సాక్షి. న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ల రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. 5జీస్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థల మధ్య పోటీ ఊపందుకున్న నేపథ్యంలో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను  ‘ఎక్స్50 ప్రొ’  పేరుతో విడుదల చేయనుంది.  న్యూఢిల్లీలో  నేడు ( సోమవారం)  మధ్నాహ్నం ‘ఎక్స్‌50 ప్రొ’ లాంచ్‌  చేయనుందని రియల్‌మి సీఈవో మాధవ్‌ సేథ్‌ ట్వీట్‌ చేశారు.

(చదవండి : స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్‌మీ)

కాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ధర  వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 +8+ 2 +2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ 8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను  అమర్చినట్టు సమాచారం. అలాగే సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 865 సాక్‌ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించనుందని అంచనా.  డ్యూయల్-మోడ్ 5 జి కనెక్టివిటీ, 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించపోయినప్పటికీ వూక్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ వల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ టీజర్‌ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

ధర :  సుమారు రూ. 50,000

మరిన్ని వార్తలు