అతిచవకైన రెడ్‌మి గో సేల్‌ 

26 Mar, 2019 10:40 IST|Sakshi

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మిగో  సెకండ్‌ సేల్‌

 జియో యూజర్లకు రూ. 2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్

 100 జీబీ డేటా ఉచితం

సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమికి చెందిన అతి చవకైన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు నేడు (మార్చి26) ప్రారంభం కాన్నాయి.  ఆప్‌ కీ నయీ దునియా ట్యాగ్‌తో లాంచ్‌ చేసిన రెడ్‌మి గో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు  ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలనుంచి ప్రారంభం. గత వారం లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండవ సేల్‌ ఇది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200  ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు.  బ్లూ అండ్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర  రూ. 4499గా  వుంది.  

రెడ్‌మిగో ఫీచర్లు 
5 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్  425 చిప్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఒరియో 
1జీబీ ర్యామ్, 8జీబీ  స్టోరేజ్‌
8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు