విమాన ప్రయాణీకులకు ఊరట

22 May, 2018 14:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్‌ చార్జీలతో  ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు  విమానయాన శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.   విమాన టికెట్లను బుక్‌ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్‌ చేసుకుంటే   ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా   మంగళవారం  వెల్లడించారు.  కొత్తగా ఎయిర్‌ సేవా  డిజి యాత్రా పథకాన్ని లాంచ్‌ చేయనున్నట్టు తెలిపారు.
 

కొన్ని సంస్కరణలపై   తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

  • బుకింగ్‌  చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు.  
  • బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్‌ చార్జీలు ఉండకూడదు.  
  • ప్రత్యేక అవసరాలతో  ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం.
  • విమాన ఆలస్యంలో ఎయిర్‌లైన్స్‌  తప్పు ఉంటే  విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
  • నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు.
  • ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్‌లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి.
  • టికెట్‌ బుకింగ్‌నకు ఆధార్‌ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో  నమోదు సమయంలో మాత్రమే  ఆధార్‌ అవసరమవుతుందనీ,  డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని  జయంత్ సిన్హా తెలిపారు.
మరిన్ని వార్తలు